Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సర్కారు వారి పాట' థియేట్రికల్ ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా ఉంటుంది' అని దర్శకుడు పరశురాం చెప్పారు. మహేష్ బాబు, పరశురాం కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'సర్కారు వారి పాట'. సోమవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను భ్రమరాంబ థియేటర్లో వేలాది మంది మహేష్బాబు అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ వేడుకలో నిర్మాతలు, చిత్ర దర్శకుడు పరశురాం మిగతా టీం సభ్యులు పాల్గొని మహేష్ బాబు అభిమానుల కేరింతల మధ్య ట్రైలర్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు పరశురాం మాట్లాడుతూ,'ట్రైలర్కి ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా. ప్రస్తుతానికి ట్రైలర్ ఎంజారు చేయండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం' అని అన్నారు.
'రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ తీరు చూస్తుంటే, మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి సినిమా అని అర్థమవుతుంది. హైవోల్టేజ్ యాక్షన్, గ్రాండ్ విజువల్స్.... మళ్ళీ మళ్ళీ వినాలనిపించే డైలాగ్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసిందీ ట్రైలర్. 'నా ప్రేమని దొంగిలించగలవు...నా స్నేహాన్నీ దొంగిలించగలవు.. యూ కాన్ట్ స్టీల్ మై మనీ..' అంటూ ఈ డైలాగ్తో మహేష్ బాబు క్యారెక్టర్ని పరిచయం చేయడం ఫ్యాన్స్కి గూస్ బంప్స్ మూమెంట్ తెచ్చింది. 'అప్పనేది ఆడపిల్ల లాంటిది సార్.. ఇక్కడెవరూ బాధ్యత గల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు' అని మహేష్ చెప్పడం, దీనికి కౌంటర్గా 'నా దష్టిలో అప్పనేది సెటప్ లాంటిది..' అని విలన్ సముద్రఖని అనడం.. కథలో హై వోల్టేజ్ కాన్ ఫ్లిక్ట్ తెలియజేస్తుంది. 'ఓ వంద వయగ్రాలు వేసి శోభనం కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు..మహేష్ పలికిన ఈ డైలాగ్ వీర లెవల్ మాస్గా విజిల్స్ కొట్టించింది. ట్రైలర్లో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్గా కనిపించారు. అలాగే మాస్ యాక్షన్తోనూ అదరగొట్టారు. దర్శకుడు పరశురాం మహేష్ బాబుని సరికొత్తగా చూపించి, అభిమానులని అలరించారు. మహేష్ బాబు కీర్తి సురేష్ జోడి లవ్లీగా ఉంది. ఈ జోడీ సిల్వర్ స్క్రీన్పై కచ్చితంగా మ్యాజిక్ చేస్తుంది. టెక్నికల్గా ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉందని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. తమన్ ట్రైలర్ కోసం చేసిన బీజీఏం స్కోర్ గ్రాండ్ ఉంది. విజువల్స్ లావిష్గా ఉండటంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని ఇంకా పెంచేసింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
'మా డైరెక్టర్ పరశురాం గారు చెప్పినట్లు ట్రైలర్ కంటే సినిమా వంద రెట్లు సూపర్గా ఉంటుంది. ఇది గ్యారెంటీ. మహేష్బాబుతో బ్లాక్బాస్టర్లాంటి సినిమా తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఫ్యాన్స్కి ఓ పండగలాంటి
సినిమా అవుతుంది. అటు అభిమానుల్లోను, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్న మా చిత్రాన్ని
ఈనెల 12న అందరూ థియేటర్లో చూసి ఎంజారు చేయండి.
- నిర్మాత నవీన్ యెర్నేని