Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం 'పథ్వీరాజ్'. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో 2017 మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ నాయికగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోని 'హరి హర్' అంటూ సాగే తొలిపాటను అక్షరు కుమార్ గురువారం రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నా నట జీవితంలో అత్యంత దేశభక్తి నిండిన పాట ఇది. ఈ పాట ఈ సినిమాకి ఒక ఆత్మ లాంటిది. మహ్మద్ ఘోరీతో చేసిన యుద్ధంలో సర్వస్వాన్ని త్యాగం చేసిన పథ్విరాజ్ చౌహాన్కి నా వందనం. దేశాన్ని రక్షించాలనే పథ్విరాజ్ బలమైన పట్టుదల ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. అలాగే పథ్వీరాజ్ తత్వాన్ని, దఢ సంకల్పాన్ని కూడా ఈ పాట తెలియజేస్తుంది. మొదట సారి విన్నపుడే ఈ పాటతో ప్రేమలో పడ్డాను' అని తెలిపారు.
ఇది అత్యంత పరాక్రమ, ధైర్య సాహసాలతో ఢిల్లీని పరిపాలించిన పథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన యోధుని పాత్రలో అక్షరు నటిస్తున్నారు. పథ్వీరాజ్ భార్య సంయోగిత పాత్రలో మనుషి చిల్లర్ కనిపించనుంది. అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ 'చాణిక్య'ని తెరకెక్కించిన డా.చంద్రప్రకాష్ ద్వివేది ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. జూన్ 3న హిందీ, తమిళంతో పాటు తెలుగులో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.