Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కేరింత' ఫేమ్ పార్వతీశం, జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోంది.
వేదుల బాలకామేశ్వరి సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం1గా ఈ కొత్త సినిమాను నిర్మిస్తోంది. 'దేవరకొండలో విజరు ప్రేమకథ' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ తన ద్వితీయ ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
సిద్ధార్థ హరియాల, తాలబత్తుల మాధవి నిర్మాతలు. ఈ నెల 25వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్న సందర్భంగా దర్శకుడు వెంకటరమణ ఎస్. మాట్లాడుతూ, 'ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 చెబుతోంది. అయితే దీనికి భిన్నంగా నేటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మారాలి. ఆర్టికల్ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. మంచి సామాజిక సందేశంతో పాటు ఓ విభిన్నమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఈ సినిమాలో రామరాజు ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. హీరో, హీరోయిన్ల పాత్రలు చాలా వినూత్నంగా ఉంటాయి' అని అన్నారు.
'సమాజాన్ని, సమాజాన్ని పాలించే ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే చిత్రమిది. సామాజిక సందేశాన్ని ప్రేమకథతో మిళితం చేసి ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం కాకినాడ, యానం, పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. తర్వాత హైదరాబాద్లో జరిగే రెండో షెడ్యూల్తో సినిమా కంప్లీట్ అవుతుంది. మొత్తం 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నాం. ఈ సందేశాత్మక ప్రేమకథలో యాక్షన్ సన్నివేశాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది' అని నిర్మాత సిద్దార్థ హరియాల చెప్పారు.
రామరాజు, చక్రపాణి, రంగస్థలం లక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ - సురేష్ కుమార్ వై, సినిమాటోగ్రఫీ - జి అమర్.