Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్రపురి కాలనీ అభివృద్ధి పనులకు అడ్డుపడద్దు అని అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని విజ్ఞప్తి చేశారు. శనివారం చిత్రపురి కాలనీ ఎంఐజీ ప్రాంగణంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కమిటీ ట్రెజరర్ మహానంద రెడ్డి, కార్యదర్శి కాదంబరి కిరణ్, సభ్యులు అళహరి, కొంగర రామకష్ణ, అనిత, లలిత, బత్తుల రఘు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ, ఃమా కమిటీ ఎన్నికైనప్పట్నుంచీ అన్ని సదుపాయాలను కాలనీ వాసులకు అందిస్తున్నాం. అయినప్పటికీ హౌసింగ్ సొసైటీపై ఆరోపణలు రావడం బాధాకరం. సొసైటీపై ఇప్పటికే 21 కేసులు కోర్టులో ఉన్నాయి. ఎంతో మంది అధికారులు విచారణ జరిపి, ఎక్కడా అవినీతి జరగలేదని తేల్చారు. ప్రస్తుతం చిత్రపురిలో ఎంఐజీ, డూప్లెక్స్, రో హౌస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎంఐజీలో ఐదు బ్లాకుల్లో రెండు బ్లాకులు పూర్తయ్యాయి. మరో మూడు తుది దశ పనుల్లో ఉన్నాయి. ఈ పనులు మరో 6 నెలల్లో పూర్తవుతాయి. ఈ పనులు జరుగుతుండగానే నిర్మాతలకు సంబంధించిన మూవీ టవర్స్లోని అవినీతి బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే తరుచూ చిత్రపురికాలనీలో వందల కోట్ల అవినీతి జరిగిదంటూ కొంత మందితో ప్రచారం చేయిస్తున్నారు. వాళ్లకు కేటాయించిన ఫ్లాట్స్ అమ్ముకుని మళ్లీ కావాలని ధర్నాలు చేస్తూ, బ్లాక్ మెయిల్స్ చేస్తున్నారు. గత పాలక మండలి అడ్వాన్సులు చెల్లించిన కంపెనీల నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే చిత్రపురి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేశాం. వచ్చే రెండు మాసాల్లో 430 మంది సినీ కార్మికులకు సింగిల్, డబుల్, ట్రిబుల్ బెడ్ రూమ్లను కేటాయించబోతున్నాం. ఆరోపణలు చేస్తే వ్యక్తులు సొసైటీకి నిధుల సేకరణ, సభ్యుల సంక్షేమం కోసం పాటుపడతామంటే మా కమిటీ సత్వరమే రాజీనామా చేస్తుంది. అలాగే కార్మికుల సంక్షేమం కోసం చిత్రపురి కాలనీలో చిరంజీవి గారు నిర్మించనున్న ఆస్పత్రి నిర్మాణ కో ఆర్డినేషన్ కోసం ఓ ప్రత్యేక కమిటీని నియమించామని చెప్పారు.