Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీశ్రీశ్రీ శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై 'భాగమతి' ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోగా, మియా జార్జ్ హీరోయిన్గా రూపొందిన చిత్రం 'మయూరాక్షి'.
వరం జయంత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 3న గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, 'పాటలు వినసొంపుగా ఉన్నాయి. ట్రైలర్ చాలా రిచ్గా ఎంతో క్యూరియా సిటీతో ఉంది. ట్రైలర్ చూశాక ఇదొక సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్న జయంత్ సినిమాల మీద ఆసక్తితో నిర్మాతగా మారి, ఇప్పటికే రెండు చిత్రాలు రిలీజ్ చేశారు. ఇది తన మూడో చిత్రం. ప్యాషన్తో వచ్చే కొత్త నిర్మాతలను ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి. ఎంతో మందికి పని దొరుకుతుంది. ఈ సినిమా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు.
'ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. ఒక యంగ్ ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు సక్సెస్ చేయాలని ఆశిస్తున్నాను' అని 'గంగపుత్రులు' హీరో రాంకీ చెప్పారు. నిర్మాత వరం జయంత్ కుమార్ మట్లాడుతూ, 'నయా సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. ఉన్ని ముకుందన్, మియా జార్జ్ నటన, గోపీసుందర్ మ్యూజిక్ సినిమాకు హైలెట్స్. జూన్ 3న సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు : పూర్ణాచారి, కో-ప్రొడ్యూసర్ : వరం యశ్వంత్ సాయి కుమార్, నిర్మాత : వరం జయంత్ కుమార్, దర్శకుడు : సాయిజు ఎస్.ఎస్.