Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్ హీరోగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'లాఠీ'. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన సునైనా కథానాయికగా నటిస్తోంది.
తాజాగా ఓ పవర్ ఫుల్ పోస్టర్తో ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీగా విడుదల కానుంది.
రిలీజ్ డే ఎనౌన్స్ మెంట్ పోస్టర్లో విశాల్ యాక్షన్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
'సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి ఉంది. విశాల్ ఈ సినిమాలో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారన్నది ఆసక్తికరం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ని దర్శకుడు వినోద్ కుమార్ సరికొత్త కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్కి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ద్వితీయార్ధంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి రచయిత: పొన్ పార్థిబన్, సంగీతం: సామ్ సిఎస్, ఛాయాగ్రహణం : బాలసుబ్రమణ్యన్, స్టంట్ మాస్టర్స్: పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల గోపి.