Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం 'మై నేమ్ఈజ్ శృతి'. ఇటీవల విడుదలైన టీజర్తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని 'మెరిసేలే.. మెరిసేలే' అంటూ సాగే వీడియో లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ, 'చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను అంటూ కథానాయిక హాన్సిక టీజర్లో చెప్పే డైలాగ్తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. 'మెరిసేలే..' పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఈ పాటను సత్య యామిని అద్భుతంగా ఆలపించారు. మార్క్ రాబీన్ స్వరాలు అందర్నీ అలరిస్తున్నాయి. వినూత్న కాన్సెప్ట్తో రూపొందుతున్న మా చిత్ర్రం అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. 'వైవిధ్యమైన కాన్సెప్ట్తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం' అని నిర్మాత బురుగు రమ్య ప్రభాకర్ చెప్పారు. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ రాబీన్, లైన్ ప్రొడ్యూసర్: విజరుకుమార్ కర్రెం, కో-ప్రొడ్యూసర్: పవన్కుమార్ బండి.