Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పూర్తయ్యింది.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'గత నెల 23 తేదీ నుంచి కశ్మీర్లో రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టార. అక్కడి అందమైన లొకేషన్స్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. కశ్మీర్ షెడ్యూల్ అమోజింగ్ ఫీల్ ఇచ్చింది. విజరు, సమంతతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై చిత్రీకరించిన సీన్స్ అద్భుతంగా వచ్చాయి. మా దర్శకుడు శివ నిర్వాణ ఈ సన్నివేశాలను చాలా బాగా హ్యాండిల్ చేశారు. త్వరలోనే హైదరాబాద్లో తదుపరి షెడ్యూల్ని స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పిలో మిగతా చిత్రీకరణ చేస్తాం. ఇటీవల విడుదల చేసిన 'ఖుషి' టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి. పక్కా ప్లానింగ్తో సినిమాని కంప్లీట్ చేసి, డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మా సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం' అని చెప్పారు.
జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: నరేష్ బాబు.పి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్, మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి.