Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఃమేజర్ః. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ,149 నిమిషాలు నిడివిగల
ఈ సినిమాలోని కంటెంట్, భావోద్వేగాలు సెన్సార్ బోర్డ్ సభ్యులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మేజర్ ఫస్ట్ హాఫ్లో సందీప్ పర్సనల్ లైఫ్, తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం, ఇషాతో చిన్ననాటి ప్రేమని ఫిదా అయ్యేలా చూపించారు. సెకండ్ హాఫ్లో భారీ యాక్షన్, హై అండ్ ఎమోషనల్ మూమెంట్స్తో ప్రేక్షకులు చూపుతిప్పుకోలేనంత గొప్ప అనుభవాన్ని ఈ చిత్రం అందిస్తుంది. భారీ నిర్మాణ విలువలు, నటీనటులు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. అడివి శేష్ తన అద్భుతమైన నటనతో అందర్నీ మెస్మరైజ్ చేస్తారు. భారీ అంచనాలతో జూన్ 3వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఃమేజర్ః చిత్రం ప్రివ్యూలు దేశవ్యాప్తంగా ప్రదర్శితం కానున్నాయిః అని తెలిపింది. ఈ చిత్రంలో అడివిశేష్కి జోడీగా సయీ మంజ్రేకర్ నటించారు.శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.