Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పూలరంగడు', 'చుట్టాలబ్బాయి' వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు వీరభద్రం చౌదరి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'సేనాపతి' చిత్రంతో ప్రశంసలు అందుకున్న హీరో నరేష్ అగస్త్య. లేటెస్ట్గా వీరిద్దరి కాంబినేషన్లో ఓ నూతన చిత్రం ఆరంభం కానుంది.
జయదుర్గాదేవి మల్టీమీడియా, డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అనిల్ రెడ్డి సమర్పణలో ఈ సరికొత్త చిత్రం తెరకెక్కనుంది.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు. జామి శ్రీనివాసరావు సహ నిర్మాత. జులై నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'దర్శకులు వీరభద్రం చౌదరి గారితో మా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మాకొక అద్భుతమైన కథ చెప్పారు. కథ వినగానే మరో ఆలోచన లేకుండా, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించాం. వీరభద్రం చౌదరి- అనూప్ రూబెన్స్ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన 'పూలరంగడు' బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో పాటు ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్గా నిలిచింది. అలాగే దర్శకుడు, మా హీరో అగస్త్యది కూడా విజయవంతమైన కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'సేనాపతి' చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇలాంటి ప్రత్యేకతలతో ఉన్న మా చిత్రంపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం' అని తెలిపారు.