Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతిరోజు పండగే' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రం జులై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని 'అందాల రాశీ..' అంటూ సాగే పాటను జూన్ 1న చిత్ర బృందం రిలీజ్ చేయనుంది.
'ఈ సినిమా టైటిల్కు అటు ఇండిస్టీ వర్గాల నుంచి, ఇటు సాధారణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో గోపీచంద్ క్యారెక్టర్ను దర్శకుడు మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. 'భలే భలే మగాడివోరు', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే' లాంటి విజయాలను అందుకున్న జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ - బన్నీవాసు కాంబినేషన్లో ఈ సినిమా వస్తోంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి 'భలేభలే మగాడివోరు', 'ప్రతిరోజు పండగే' వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. 'ప్రతి రోజు పండగే' సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.
రావు రమేష్, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్, మ్యూజిక్ : జకేస్ బీజారు, సహ నిర్మాత : ఎస్.కె.ఎన్, లైన్ ప్రొడ్యూసర్ : బాబు, ఎడిటింగ్ : ఎన్ పి ఉద్భవ్, కెమెరా : కరమ్ చావ్ల.