Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో 'శుక్ర' దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా 'మాటరాని మౌనమిది'. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో శిక్షణ పొందిన మహేష్ దత్త, తెలుగు అమ్మాయి సోని శ్రీవాస్తవ హీరో, హీరోయిన్లుగా ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. లవ్స్టోరీ విత్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో మల్టీజోనర్గా రూపొందుతున్న చిత్రమిది.
తాజాగా ఈ చిత్రం నుంచి 'దం దం దంపుడు లక్ష్మీ' అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. అషిర్ లూక్ స్వరపర్చిన ఈ పాటకు డి సయ్యద్ బాషా సాహిత్యాన్ని అందించగా, రేవంత్, మనీషా పాండ్రంకి, యువరాహుల్ కనపర్తి ఆలపించారు. ఈ పాటలో జాస్ప్రీత్ కౌర్ నటించారు. 'లక్ష్మీ..మాయదారి మాపటేల చిన్నోడు సూటు బూటు ఏసుకుని నా కంట పడ్డాడు.. దుబాయి జావిదును కలిపిస్తానన్నాడు, నూజివీడు మామిడి తోట రాసిస్తానన్నాడు..అంటూ మాస్ను ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. అలాగే ఇటీవల విడుదల చేసిన చిత్ర గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్, శ్రీహరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, దర్శకుడు :సుకు పూర్వాజ్.