Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'.
నాగశేఖర్ మూవీస్ బ్యానర్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్పై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్.ఎస్.రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
'ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కూడా కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలను ప్రేక్షకులకి గుర్తు చేసే సినిమా ఇది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రామారావు చింతపల్లి వరుస సినిమాలతో ఇండిస్టీలో తన మార్క్ చూపించుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తూ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్గా మారుతున్నారు. ఈ సినిమా నిర్మాణంలోనూ ఆయన భాగస్వామ్యం చాలా ఉంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కన్నడలో విడుదలై, సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్టైల్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు నటిస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఇండిస్టీ వర్గాల్లోనూ ఈ సినిమాపై ప్రత్యేక క్రేజ్ నెెలకొంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ హైలైట్గా నిలిచింది. ఈ పాట అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చుతుంది. ఈ సినిమాను జూలై 15న విడుదల గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.