Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ సినిమాని బాగుందని మెచ్చుకోవడం, ఆ సినిమా తాలూకా గొప్పదనం గురించి, ఆ సినిమా అందిస్తున్న స్ఫూర్తి గురించి, అందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి..
ఓ అగ్ర కథానాయకుడు మెచ్చు కుంటూ స్పందించడాన్ని చాలా అరుదుగా చూస్తుంటాం. ఇలాంటి అరుదైన ప్రత్యేకతకు పవన్కళ్యాణ్ లాంటి అగ్ర కథానాయకుడు సెంటర్పాయింట్ అవ్వడం విశేషమని వేరే చెప్పక్కర్లేదు.
ఇటీవల విడుదలై యువతలో స్ఫూర్తి నింపుతున్న 'మేజర్' గురించి పవన్కళ్యాణ్ స్పందించారు. ఆ స్పందన ఆయన మాటల్లోనే.. 'ముంబయి మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హౌమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొంది. నాడు చేసిన కమెండో ఆపరేషన్లో మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై 'మేజర్'గా ఆవిష్కరించిన చిత్ర బందానికి అభినందనలు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించాను. అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించింది. మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో ఈ చిత్రాన్ని ఇంకా చూడలేదు. త్వరలోనే వీక్షిస్తాను. సోదరుడు అడివి శేష్ గారికి హదయపూర్వక అభినందనలు. సినిమాలో భిన్న శాఖలపై అభినవేశం ఉన్న సజనశీలి. ఇటువంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలి. ఒక సాహసి కథను చలన చిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శశికిరణ్కు శుభాకాంక్షలు. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్ బాబు గారికి, చిత్ర నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డికి నా అభినందనలు. ఈ చిత్రంలో నటించిన ప్రకాష్ రాజ్, రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మలకు, చిత్ర సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు' అని పేర్కొన్నారు.