Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గణేష్ బెల్లంకొండ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'.
వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపు కుంటోంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత సూర్య దేవర నాగవంశీ తెలిపారు. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాగా దర్శకుడు ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ''స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలతోపాటు వినోదాన్ని పుష్కలంగా పంచుతూ సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి' అని దర్శకుడు లక్ష్మణ్.కె.కృష్ణ అన్నారు. నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, ఛాయా గ్రహణం: సూర్య, ఎడిటర్: నవీన్ నూలి, కళ: అవినాష్ కొల్ల, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్.