Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగచైతన్య 'మనం' లాంటి బ్లాక్బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం 'థ్యాంక్యూ'.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
గురువారం ఈ చిత్రం నుంచి 'ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో..నీతో నేనెంటో.. చూసే చూపేంటో..మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో' అంటూ సాగే మ్యాజికల్ మెలోడి లిరికల్ వీడియోను చిత్రబందం రిలీజ్ చేసింది. బ్యూటిఫుల్ మెలోడి సాంగ్గా అందర్ని ఆకట్టుకుంటున్న ఈ పాటకు గీత రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, జోనిత గాంధీ ఆలపించారు. సంగీత దర్శకుడు తమన్ అద్భుతమైన స్వరాలను అందించారు. ఇటీవల రిలీజ్ చేసిన టీీజర్తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం తాజాగా విడుదలైన పాటతో భారీగా అంచనాలనూ పెంచింది. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించారు' అని చిత్ర బృందం తెలిపింది.