Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్టర్ శశాంత్, మరో ఇద్దరు చిన్నారులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పోయే ఏనుగు పోయే'.
పీకేన్ బ్యానర్ పై కెఎస్నాయక్ దర్శకత్వంలో పోవనమ్మళ్ కేషవన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏనుగు కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ను శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్లో ముఖ్య అతిథి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత పవనమ్మాళ్ కేశవన్ మాట్లాడుతూ, 'విలన్కు ఒక నిధి మ్యాప్ దొరుకుతుంది. ఆ నిధి దక్కాలంటే ఒక ఏనుగు పిల్లను బలి ఇవ్వాలని ఒక మంత్రగాడు చెబుతాడు. దాంతో విలన్ ఏం చేశాడు?, దాని పర్యవసానం ఏంటనేదే ఈ సినిమా. ఇందులో బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరుల పాత్రలు అందర్నీ అలరిస్తాయి. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం' అని అన్నారు.