Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు ప్రభుదేవా. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మై డియర్ భూతం'. తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు సొంతం చేసుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ పై రమేష్ పి పిళ్ళై ఈ చిత్రాన్ని నిర్మించగా, తెలుగులో శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏ ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బందం. ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభుదేవా జీనీగా నటిస్తున్నారు. జీనీ పాత్రలోకి ప్రభుదేవా పూర్తిగా పరకాయ ప్రవేశం చేసిన విధానం, ఆయన లుక్ ఎంతో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈ మేకోవర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో లుక్ను బట్టి తెలుస్తుంది. రమ్య నంబీసన్ కీలక పాత్రలో నటిస్తుండగా, బిగ్ బాస్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వీఎఫ్ఎక్స్ను భారీగా ఉపయోగించబోతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.
అశ్వత్, పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత, సంయుక్త,ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్: ఎన్.రాఘవన్, ప్రొడ్యూసర్ : రమేష్ పి పిళ్ళై, మ్యూజిక్: డి ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: యూకే సెంథిల్ కుమార్.