Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న నయా సినిమా బుధవారం ముహూర్తం జరుపుకుంది. రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. సాయిధర్మ తేజ్ క్లాప్ హీరో ఇవ్వగా, దర్శకుడు సుధీర్ వర్మ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ను నిర్మాత ఎస్.నాగవంశీ చిత్ర దర్శకుడు శ్రీకాంత్కు అందించారు.
ఈ సినిమా ప్రారంభం సందర్భంగా మేకర్స్ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. 'రేరు రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా...' అని చిత్రంలో ప్రతినాయక పాత్ర హెచ్చరికగా అంటే, 'ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.... ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు... సూస్కుందాం రా....
తలలు కోసి సేతికిస్తా నాయాలా...!' అంటూ కథానాయకుడు మరింతగా హెచ్చరించడం కనిపిస్తుంది. పదునైన ఈ సంభాషణలకు సమకూర్చిన నేపథ్య సంగీతం మరింత పౌరుషాన్ని పెంచినట్లయింది. 2023 సంక్రాంతికి చిత్రం విడుదల అని కూడా కనిపిస్తుంది. తొలిచిత్రంతోనే స్టార్గా ప్రేక్షక హదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. కథానాయికగా 'శ్రీ లీల' నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి పి.డి.వి. ప్రసాద్ సమర్పకుడు.