Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో లక్ష్ తాజాగా నటించిన చిత్రం 'గ్యాంగ్స్టర్ గంగరాజు'. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా హీరో లక్ష్ మీడియాతో మాట్లాడుతూ, 'నాలుగు సంవత్సరాల క్రితం నేను ప్రొడ్యూసర్గా చేస్తున్న టైంలో శ్రీనువైట్ల, మురుగదాస్ దగ్గర చాలా సినిమాలకు వర్క్ చేసిన ఇషాన్ సూర్య ఒక మంచి కథ చెప్పాడు. 'వలయం' సినిమా తర్వాత ఫుల్ మాస్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా చేసిన చక్కటి సినిమా ఇది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. గ్యాంగ్ స్టర్ అన్నాక అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ స్టోరీ అంతా ఒక ఫిక్షనల్ టౌన్లో జరుగుతుంది. అయితే ఫిక్షనల్ టౌన్లో గ్యాంగ్ స్టర్ స్టోరీ ఏంటి అనేదే ఈ కథ. ఇందులో ఉన్న నలుగురు విలన్స్ డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు. హీరో తనకంటే పవర్ ఫుల్గా ఉన్నవాళ్ళతో ఢకొీంటే బాగుంటుందని ఉద్దేశంతో, రాజమౌళి గారి సినిమాలో విలన్, శ్రీను వైట్ల గారి సినిమాలో హీరో..ఈ ఇద్దరు కలిసి స్టోరీ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది.
మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు విన్న ఈ సాంగ్స్ కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో సెకండాఫ్ చాలా బాగా వచ్చింది. ఎమోషనల్గా ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం విజిల్స్ వేసేలా ఉంటుంది. థియేటర్లో సినిమా చూసి బయటికి వచ్చేటప్పుడు ప్రేక్షకులు చాలా శాటిస్పై అవుతారు ఈ సినిమా తర్వాత చేస్తున్న 'ధీర'' చాలా డిఫరెంట్గా, స్టైలిష్గా ఉంటుంది. ఈ సినిమా రా..గా మాసీగా ఉంటే ఆ సినిమా సిటీ బ్యాక్డ్రాప్లో ఒక 'ఖైదీ' లాగా జరిగే స్టొరీ' అని చెప్పారు.