Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ మైఖేల్ జాక్సన్గా పేరొందిన ప్రభు దేవా ప్రధాన పాత్రలో రాబోతున్న కొత్త సినిమా 'మై డియర్ భూతం'. వైవిద్య భరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్.రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకుమించిన నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'మాస్టర్ ఓ మై మాస్టర్..' అంటూ ఫాస్ట్ బీట్తో ఉన్న ఈ పాటలో ప్రభుదేవా డాన్స్ హైలైట్గా నిలిచింది. ఎప్పటిలాగే స్టైలిష్ స్టెప్స్తో ఆయన ఆకట్టుకుంటున్నారు.
'నీ మనసు కన్న కళలు అన్నీ చూసేరు.. చూసేరు.. నిన్ను మించినోడు లేనేలేడు ఆడేరు పాడేరు..' అంటూ రాసిన లిరిక్స్ ప్రేరణాత్మకంగా ఉన్నాయి. అరవింద్ అన్నెస్ట్ పాడిన ఈ పాటకు డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి అందించిన లిరిక్స్ ప్రాణం పోశాయి. రాజేష్, డి.ఇమ్మాన్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవెల్ మార్చేశాయి. పాటకు తగ్గట్టుగా డిఫరెంట్గా చూపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సాంగ్ ఈ చిత్రానికి సినిమాకు మేజర్ ఎట్రాక్షన్ అవుతుందని స్పష్టమవుతోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్గా మారింది.
ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటిస్తున్నారు. ఓ మంచి మెసేజ్ ఇస్తూ జీనీకి, కిడ్స్కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ సినిమా అలరించనుంది. జీనీ పాత్రలో ప్రభుదేవా ఒదిగిపోయారు. ప్రభు దేవా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించేలా ఈ సినిమా రూపొందిస్తున్నామని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని దర్శక, నిర్మాతలు అన్నారు. ఈ చిత్రంలో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా, బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.