Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్లో 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్గా వస్తున్న సినిమా 'కార్తికేయ2'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోందని చిత్ర బృందం తెలిపింది.
'శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం' అంటూ అదిరిపోయే డైలాగ్తో ఈ ట్రైలర్ మొదలైంది. కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు అదనపు ఆకర్షణ. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ కార్తికే ఘట్టమనేని. టెక్నీషియన్స్తో అద్బుతమైన అవుట్ఫుట్ తీసుకున్నారు దర్శకుడు చందూ మొండేటి. 'కార్తికేయ'కు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా అంచనాలు అందుకోవడమే కాదు.. మించిపోయేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్, టీజర్ ఇవన్నీ.. అందరిలోనూ ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. దీంతో ఇదొక క్రేజీ ప్రాజెక్ట్గా ఇండిస్టీలోనూ నిలిచింది. ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ చిత్రంలో నిఖిల్కి జంటగా ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకష్ణుడు చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని ట్రైలర్ రూపంలో దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉన్న ఈ సినిమా కచ్చితంగా 'కార్తికేయ' చిత్ర విజయాన్ని మించేలా ఉంటుందనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు. నిఖిల్, అనుపమా జంట ప్రేక్షకుల్ని మెస్మరూజ్ చేస్తుంది. ఈ సినిమాలోని ప్రతి అంశం ఆద్యంతమూ ఉత్కంఠభరితం సాగుతూ ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, జులై 22న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది' అని చిత్ర యూనిట్ పేర్కొంది.
శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్ప్లే-దర్శకత్యం : చందు మొండేటి, కో-ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల, నిర్మాతలు: టి.జివిశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, మ్యూజిక్: కాలభైరవ, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్.