Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి.మధు నిర్మిస్తున్న సినిమా 'పంచతంత్ర కథలు'. గంగనమోని శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఐదు వేరు వేరు కథల ఆంథాలజీ కావడంతో ఈ చిత్రానికి 'పంచతంత్ర కథలు' అనే టైటిల్ని ఖరారు చేశారు. ప్రస్తుతం సెన్సార్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మొదటి పాట 'మోతెవరి..' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ని దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.
ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు కమ్రాన్ క్యాచీ ట్యూన్తో స్వరపరిచారు. లేటెస్ట్ సెన్సేషన్ రామ్ మిరియాల ఈ పాటను తనదైన శైలిలో ఆలపించి, ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ లిస్ట్లో చేర్చారు.
ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, 'ఇది నా ఫేవరేట్ సాంగ్. ఈ సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఈ సాంగ్ విన్నాను. చాలా ఇన్స్పైరింగ్ సాంగ్. తప్పకుండా వైరల్ అవుతుందని అప్పుడే అనిపించింది. కాసర్ల శ్యామ్ గారు మంచి సాహిత్యం అందించారు. రామ్ మిరియాల అందరి ఫేవరేట్. ఇక సంగీత దర్శకుడు కమ్రాన్ చాలా కాలంగా తెలుసు. మంచి ట్యూన్ ఇచ్చారు. లిరికల్ వీడియోలో దర్శకుడు శేఖర్ మేకింగ్, విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. సర్ప్రైజింగ్గా మా అమ్మగారితో కూడా ఒక క్యారెక్టర్ చేయించారు. ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్గా ఉన్నాను' అని అన్నారు.
నోయెల్, నందిని రారు, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత : డి.రవీందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాలకూరి సాయికుమార్, మాటలు, లైన్ ప్రొడ్యూసర్: అజర్ షేక్.