Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం, గోపీనాథ్ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'సమ్మతమే'. చాందిని చౌదరి కథానాయిక.
యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పీపుల్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి హౌస్ ఫుల్గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ సక్సెస్ మీట్లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,'దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ కథని ఎంత బలంగా నమ్మారో, అంతే బలంగా తీశారు. థియేటర్ల సంఖ్య పెరుగుతున్నాయి. యూస్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిపీట్ ఆడియన్స్ వెళ్తున్నారు. రెస్పాన్స్, కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి' అని తెలిపారు. ''సమ్మతమే' అద్భుతమైన రెస్పాన్స్తో పీపుల్స్ బ్లాక్బస్టర్గా నిలవడం ఆనందంగా ఉంది' అని దర్శకుడు గోపీనాథ్ రెడ్డి చెప్పారు. నిర్మాత ప్రవీణ రెడ్డి మాట్లాడుతూ, 'ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు కతజ్ఞతలు. మేం ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని అందించారు. మీ అబ్బాయి సినిమాని అద్భుతంగా తీశారని అందరూ చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమాలో పని చేసిన కిరణ్, చాందిని, కెమరామెన్ సతీష్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, ఎడిటర్ విప్లవ్ మిగతా టీం అందరికీ ధన్యవాదాలు. మాకు చాలా సపోర్ట్గా నిలిచారు' అని అన్నారు.