Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందిన సినిమా 'పక్కా కమర్షియల్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ వాస్ నిర్మాత. ఈ చిత్రాన్ని జులై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు మారుతి సోమవారం మీడియాతో ముచ్చటించారు.
మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవిగారి లాంటి గొప్ప వ్యక్తి నాతో సినిమా చేస్తానని చెప్పడం నాకు గొప్ప ఎనర్జీ ఇచ్చినట్టు అనిపించింది. నాలాంటి డైరెక్టర్కు ఇదొక గొప్ప ఎంకరేజ్మెంట్.
ఈ సినిమాతో గోపీచంద్గారు మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా ఆయన చాలా స్టైలిష్గా కనిపిస్తారు. ఈ సినిమా తనకు మంచి పేరు తీసుకొస్తుందని ఆయన కూడా బాగా నమ్మారు. అలాగే ఈ సినిమాలో నాయిక రాశీఖన్నా ప్రేక్షకుల్ని హిలేరియస్గా నవ్విస్తుంది.
జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ నుంచే 'భలేభలే మగాడివోరు', 'ప్రతిరోజు పండగే' వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు నాకు చాలా మంచి పేరు తీసుకు వచ్చాయి. దానికి కారణం మంచి కథ, నటీనటులు, టెక్నిషియన్స్ సెట్ అవ్వడం. ఈ సినిమాలో కూడా సత్యరాజ్, రావు రమేష్ పోషించిన పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అలాగే సిరివెన్నెల గారు రాసిన టైటిల్ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడు జకేస్ బీజారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మంచి కథతో తెరకెక్కించిన ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులు హ్యాపీగా కాలర్ ఎగరేసుకుని చూసే సినిమా ఇది. ఒక మంచి ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమా చూసిన వారందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్కి, గీతా ఆర్ట్స్కి నా ప్రత్యేక కతజ్ఞతలు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి, టెక్నీషియన్స్ అందరికి చాలా థ్యాంక్స్.
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో చిరంజీవిగారితో సినిమా అనుకున్నాం. ఆయనకు ఒక లైన్ చెప్పాను, నచ్చింది. మెగాస్టార్ డేట్స్ను బట్టి ఆ సినిమా చేస్తాను. ప్రభాస్ సినిమా కూడా ఆయన స్థాయికి తగినట్లే గ్రాండ్గా చేయబోతున్నాను. నేను ఎవరితో సినిమా చేసినా దర్శకుడిగా కాకుండా ఓ ప్రేక్షకుడిగా ఆలోచించి, తీస్తాను.