Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పథ్వీరాజ్ సుకుమారన్, షాజీ కైలాస్ కాంబినేషన్లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ 'కడువా'. పాన్ ఇండియా ఎంటర్టైనర్గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూలై 7న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
తొలుత ఈ చిత్రాన్ని జూన్ 30న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని జూలై7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కథానాయకుడు పృథ్వీరాజ్ సినిమా విడుదలపై స్పందిస్తూ, 'అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులందరికీ క్షమాపణలు. అనుకోని పరిస్థితుల వలన మా చిత్రం విడుదల జూలై7కి, వారం రోజుల వాయిదా పడింది. ప్రచార కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తాం. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కి మీ అందరి ప్రేమ, మద్దతు కొనసాగాలి' అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరారు మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్ర టీజర్ యాక్షన్. మాస్ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, సినిమాపై భారీ అంచనాలు పెంచింది. మ్యాజిక్ ఫ్రేమ్స్, పథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీష్ పోతన్ తదితరులు నటించిన ఈచిత్రానికి రచన: జిను వి అబ్రహం, డీవోపీ: అభినందన్ రామానుజం, ఎడిటర్: షమీర్ మహమ్మద్, ఆర్ట్: మోహన్ దాస్.