Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'హ్యాపీ బర్త్ డే'. ఈ చిత్రాన్ని 'మత్తువదలరా' ఫేమ్ రితేష్ రానా రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూలై 8న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, 'మైత్రీ మూవీ మేకర్స్ అంటే మంచి ప్రాజెక్ట్స్ వెతికి పట్టుకుంటూ, బంగారం తవ్వుకునే సంస్థ. ఈ సినిమా కూడా ఆ సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బ్లాక్ బస్టర్గా ఉంది. చెర్రీకి సినిమా ప్రొడక్షన్ మీద చాలా అవగాహన ఉంది. ఆయన ఏ సంస్థకైనా అస్సెట్ లాంటి వారు. ఈ సినిమా చెర్రికి మంచి సక్సెస్ ఇవ్వాలి. దర్శకుడు రితేష్కు తన సినిమాల మీద నమ్మకం ఎక్కువ. ట్రైలర్లో పాన్ తెలుగు సినిమా అని చూడగానే అతనిలో నవ్వొచ్చింది. లావణ్య క్యారెక్టర్ బాగుంది. ఇప్పుడున్న కమెడియన్స్లో నాకు వెన్నెల కిషోర్, సత్య అంటే ఇష్టం. వాళ్లు టీజర్, ట్రైలర్లో ఆకట్టుకునేలా ఉన్నారు. కామెడీ, థ్రిల్లర్ కలిపి చేయడం కష్టం. ఒకటి ఎక్కువైతే ఇంకొటి తగ్గిపోతుంది. రితేష్ వాటిని బాగా కంబైన్డ్ చేసి ఉంటాడని తెలుస్తోంది' అని తెలిపారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ, 'మాదొక డిఫరెంట్ ఫిల్మ్ అని మేం చెప్పక్కర్లేదు. టీజర్, ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. నిర్మాత కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి మూవీ తెరపైకి వస్తుంది. దర్శకుడిగా రితేష్ రానా ఇప్పటికే నిరూపించుకున్నాడు. నేను ఈ తరహా సినిమాలో నటిస్తానని అనుకోలేదు. నా క్యారెక్టర్ కంప్లీట్గా కొత్తగా ఉంటుంది' అని అన్నారు. ''మత్తు వదలరా' టీమ్ మళ్లీ ఈ చిత్రానికీ పనిచేశారు. అదే మ్యాజిక్ ఈ సినిమాలోనూ చేసి ఉంటారని నమ్ముతున్నాం. 'జాతి రత్నాలు' మూవీని ఎలా ఫ్యామిలీతో కలిసి ఎంజారు చేశారో, మా చిత్రాన్నీ అలాగే ఆస్వాదిస్తారు. లావణ్య త్రిపాఠీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది' అని నిర్మాత వై రవిశంకర్ చెప్పారు.
నిర్మాత చెర్రి మాట్లాడుతూ, 'ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇదొక కొత్త తరహా సినిమా అని మీకు అర్థమై ఉంటుంది. దర్శకుడు రితేష్ తన మొదటి సినిమా 'మత్తు వదలరా'తో హిలేరియస్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఇదొక సర్రియల్ యాక్షన్ కామెడీ ఫిల్మ్. ఫిక్షనల్ నేపథ్యంతో కథ సాగుతుంది. ఒక్కో ఛాప్టర్ ద్వారా ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వెళ్లారు దర్శకుడు. చివరలో ఆ పాత్రలన్నీ ఎలా కలుస్తాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఒక మంచి థ్రిల్లింగ్ కామెడీని ఇందులో చూస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకుల విశేషంగా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు.
నా మొదటి చిత్రం టీమ్తోనే మళ్లీ పనిచేశాను. దాని కంటే ఈ సినిమాలో డబుల్ ఫన్, డబుల్ యాక్షన్, డబుల్ థ్రిల్ ఉంటుంది. థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.
- దర్శకుడు రితేష్ రానా