Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ నిర్మిస్తున్న చిత్రమిది. ఎ.ఆర్.మోహన్ దర్శకుడు. రాజేష్ దండ నిర్మాత. బాలాజీ గుత్త సహ నిర్మాత. ఆనంది కథానాయిక.
గురువారం అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్ని రిలీజ్ చేశారు. 'అమాయకులైన గిరిజనులకు న్యాయం చేయటం కోసం ఓ అధికారికగా అల్లరి నరేష్ ఎలాంటి కష్టాలు పడ్డాడు?, అతను చేసిన పోరాటం ఏంటి అనేదే ఈ సినిమా అని టీజర్ చెప్పకనే చెప్పింది. ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే మేకర్స్ విడుదల చేయబోతున్నారు.