Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు(68) అనారోగ్య కారణాలతో బుధవారం కన్నుమూశారు. తెలుగు సహా వివిధ భాషల్లో సుమారు 800 పైగా సినిమాలకు పని చేసిన అనుభవం ఉన్న గౌతంరాజు గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్య కారణాలతో కొన్నాళ్ల క్రితమే హాస్పిటల్లో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన మృతికి చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలను అందజేశారు. ఈ మేరకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆ మొత్తాన్ని ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. గౌతంరాజు మృతిపట్ల పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సంతాపాన్ని ప్రకటించారు.