Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శేఖర్ కమ్ముల- రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన 'లీడర్' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ సినిమాలో తన అందం, అభినయంతో చలనచిత్ర పరిశ్రమలో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి, 180 సినిమాలతో నటిగా మెప్పించారు. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ మళ్లీ తన అభిమానుల్ని అలరించనున్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో 'మా నీళ్ల ట్యాంక్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో రూపొందుతున్న వెబ్ సిరీస్లో నటిస్తున్నారు ప్రియా ఆనంద్. ఒక చిన్న గ్రామంలో పనికిరాని వాటర్ ట్యాంక్ చుట్టూ నడిచే కథతో, సరదా సరదా సన్నివేశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. జీ5 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పల్లెటూరు అమ్మాయిగా ప్రియా ఆనంద్ కనిపిస్తున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సీరిస్ జులై 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిలో ప్రియా సొంతంగా డబ్బింగ్ చెప్పారు. విడుదలైన చిత్రం టీజర్లో ప్రియా ఆనంద్ నటనను దర్శకుడు విక్రమ్ కె కుమార్ మెచ్చుకోవడం విశేషం.