Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్గా సుపరిచితం ప్రభుదేవా. ఈ ఫేమ్ కంటిన్యూ చేస్తూనే హీరోగా, దర్శకుడిగా తన టాలెంట్ బయటపెట్టి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి చిత్రసీమకు సూపర్ హిట్స్ అందించారు. నటుడిగా ఎన్నో సినిమాల్లో వెండితెరపై ప్రభు దేవా మార్క్ కనిపించింది. ఈ క్రమంలోనే ప్రభుదేవా ముఖ్య పాత్రలో రాబోతున్న కొత్త సినిమా 'మై డియర్ భూతం'. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవా క్యారెక్టర్ తో పాటు అడ్వెంచర్ సీన్స్, గ్రాఫిక్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయట. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకుమించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షఉటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్గా జూలై15వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసి ఎంజారు చేయదగ్గ చిత్రమని దర్శకనిర్మాతలు చెప్పారు. చక్కని అవుట్పుట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఈ మూవీ ప్రభుదేవా కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మై డియర్ భూతం మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సాంగ్, పోస్టర్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ ఫాంటసీ మూవీలో ఎప్పటిలాగే ప్రభుదేవా ఎంతో స్టైలిష్గా కనిపించడంతో పాటు కాస్త థ్రిల్ కూడా చేయబోతున్నారని ఇప్పటికే విడుదల చేసిన అప్డేట్స్ ద్వారా తెలిసింది. ఈ సినిమాతో మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారట. జీనీకి కిడ్స్కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ లోని సన్నివేశాలు అబ్బురపరచనున్నాయట. ప్రభు దేవా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించేలా ఈ మూవీ తెరకెక్కించామని మేకర్స్ తెలిపారు.