Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదు భిన్న కథలతో ఆంథాలజీ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'పంచతంత్ర కథలు'. మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి.మధు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నోయెల్, నందిని రారు, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజరు కతుర్వర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన 'మోతెవరి' సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్తో చార్ట్బస్టర్గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ఈ ఆంథాలజీ ఐదు వేరు వేరు కథలు, వేరు వేరు జోనర్లలో రావడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్స్ అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. అన్నింటిని మించి మా ఫ్యామిలీ మెంబర్ నోయెల్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను' అని అన్నారు.ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి, మేకర్స్ని అభినందించారు. అతి త్వరలో ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: గంగనమోని శేఖర్, సంగీతం: కమ్రాన్, కో ప్రొడ్యూసర్: డి. రవీందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాలకూరి సాయికుమార్, మాటలు, లైన్ ప్రొడ్యూసర్: అజర్ షేక్, సినిమాటోగ్రఫి: గంగనమోని శేఖర్, విజరు భాస్కర్ సద్దల, ఎడిటర్: శ్రీనివాస్ వరగంటి, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యాం, మామా సింగ్.