Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు మహేష్ బాబు, అగ్ర దర్శకుడు తివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకష్ణ (చినబాబు) నిర్మిస్తున్న భారీ, ప్రతిష్టాత్మక సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన నాయిక పూజాహెగ్డే మరోసారి జతకడుతున్నారు. మహేష్బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ప్రచార చిత్రంను 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే... జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్.ప్రకాష్, ఛాయాగ్రాహకుడుగా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం అవగతమవుతుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' దశాబ్ద కాలానికి పైగా నేటికీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్లో మరో బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ చిత్రీకరణ ప్రారంభం అవుతోందన్న వార్త అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది.ఆగస్టు నెలలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది (2023) వేసవిలో చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కష్ణ ఈ సందర్భంగా తెలిపారు. టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన స్పెషల్ క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి నిర్మాత: ఎస్.రాధాకష్ణ(చినబాబు), రచన, దర్శకత్వం: త్రివిక్రమ్.