Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లవ్స్టోరీ', 'శ్యామ్ సింగ రారు', 'విరాటపర్వం' వంటి సినిమాల తరహాలోనే మరో మంచి పాత్ర పోషించే అవకాశం 'గార్గి' ద్వారా రావడం ఆనందంగా ఉంది. పితృస్వామ్య వ్యవస్థను ప్రశ్నించే సినిమా 'గార్గి'' అని కథానాయిక సాయిపల్లవి అన్నారు.
తాజాగా ఆమె నటించిన చిత్రం తమిళ, తెలుగు చిత్రం 'గార్గి'. ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని రానా సమర్పిస్తున్నారు. తమిళంలో సూర్య సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని నాయిక ఐశ్వర్య లక్ష్మి నిర్మాతగా నిర్మించారు.
త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న 'గార్గి' చిత్రం గురించి నాయిక సాయిపల్లవి సోమవారం మీడియాతో ముచ్చటించారు.
'ఇందులో నేను టీచర్ పాత్ర పోషించాను. నా పాత్రకు ఈ సినిమా కథకి ఉన్న సంబంధం ఏంటనేది సినిమాలో చూస్తేనే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇలాంటి పాత్రను పోషించే అవకాశం రావడం నటిగా గర్వపడుతున్నా. నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించారు. సూర్యగారు నటించిన 'జై భీమ్' తరహాలో ఈ సినిమాలోనూ బలమైన కోర్టు రూమ్ డ్రామా ఉంది. పితృ స్వామ్య వ్యవస్థపై ఓ మహిళా లాయర్ ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందనేదే ఈ సినిమా. ఇందులో ఐశ్వర్య లక్ష్మీగారు ఓ పాత్ర పోషించారు. అది అందర్నీ మెప్పిస్తుంది. సమాజాన్ని ఆలోచింపజేసేలా ఈ సినిమా చేస్తుంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ సరసన ఓ తమిళ సినిమా చేస్తున్నాను. తెలుగులో ఇంకా ఏ సినిమాకి గ్రీన్సిగల్ ఇవ్వలేదు' అని సాయిపల్లవి తెలిపారు.