Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా, వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అనుకోని ప్రయాణం'.
రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా బెక్కం వేణుగోపాల్ సమర్పణలో విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ 'ఏ కథను.. ఏ కంచికి..'ని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సాంగ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కోటి గారి దగ్గర శివ తొమ్మిదేళ్ళు పని చేశారు. సంగీత ద్ఫర్శకుడిగా శివ మంచి విజయాలు అందుకోవాలి. పాటకు ఆక్సిజన్ నింపే శంకర్ మహదేవన్ గారు ఈ పాటని చాలా బ్రిలియంట్గా పాడారు. మధుకిరణ్ ఈ పాటకు మంచి సాహిత్యం అందించారు. రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటులు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. ఈ చిత్రం కూడా మరో మంచి చిత్రం అవుతుందని నమ్మతున్నాను' అని అన్నారు.
పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేక సుధాకర్, నారాయణరావు, అనంత్, ప్రభాస్ శ్రీను , రంగస్థలం మహేష్, జోగి సోదరులు ధనరాజ్, కంచరపాలెం కిషోర్, జెమిని సురేష్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం : వెంకటేష్ పెదిరెడ్ల, కథ, నిర్మాత : డా.జగన్ మోహన్ డి వై, సమర్పణ : బెక్కం వేణుగోపాల్, డీవోపీ : మల్లికార్జున్ నరగాని, సంగీతం : ఎస్ శివ దినవహి, ఎడిటర్ : రామ్ తుము, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మణికుమార్ పాత్రుడు, ఆర్ట్ డైరెక్టర్ : సురేష్ భీమగాని.