Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్లో 'కార్తికేయ'కి సీక్వెల్గా వస్తున్న 'కార్తికేయ2' పై అంచనాలు భారీగా ఉన్నాయి. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ, విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'ఇప్పటికే విడుదలైన ట్రైలర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. 'శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం' అంటూ అదిరిపోయే డైలాగ్స్తో సాగిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకష్ణుడు చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నారు. ఈ చిత్రంలోని భావాన్ని ట్రైలర్ రూపంలో దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన 'నన్ను నేను అడిగా' వీడియో సాంగ్కు అనూహ్య స్పందన లభించింది. 'అడిగా నన్ను నేను అడిగా.. నాకెవ్వరు నువ్వని.. అడిగా నిన్ను నేను అడిగానే.. నిన్నలా లేనని.. నవ్వుతూ నన్ను కోసినావే గాయమైన లేకనే..' అంటూ సాగే ఈ పాట చాలా వినసొంపుగా ఉంది. కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ పాటకు అదనపు ఆకర్షణ. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ కార్తికే ఘట్టమనేని. టెక్నీషియన్స్తో అద్బుతమైన అవుట్ ఫుట్ తీసుకున్నారు దర్శకుడు చందూ మొండేటి. 'కార్తికేయ'కు సీక్వెల్గా వస్తున్న 'కార్తికేయ 2' అంచనాలు అందుకోవడం కాదు, మించిపోయేలా దర్శకుడు తెెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో నిఖిల్కి జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి మ్యూజిక్: కాలభైరవ, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్.