Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూజా భలేకర్ ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్స్ చిత్రం 'లడ్కీ' (తెలుగులో 'అమ్మాయి'). టి.అంజయ్య, శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఇండో, చైనీస్ కో ప్రొడక్షన్స్, పారిజాత క్రియేషన్స్, ఆర్ట్సీ మీడియా పతాకాలపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా 47,000 స్క్రీన్స్లో విడుదల ఆవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ,''శివ'లాంటి సినిమా తీసిన వర్మ మళ్ళీ ఈ సినిమాతో కనిపించాడు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి' అని అన్నారు.
'ఈ సినిమా ట్రైలర్ చూసినపుడు ఇందులో ఎమోషన్ ఉంది. ఎమోషన్ కూడా సక్సెస్కు చాలా అవసరం. డెఫినెట్గా ఇదొక మంచి సినిమా అవుతుంది' అని సంగీత దర్శకుడు కీరవాణి చెప్పారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, 'ఇది నేను ఎమోషనలై తీసిన సినిమా' అని తెలిపారు.