Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఉప్పెన' సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్. ఆయన హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బాపినీడు.బి సమర్పణలో, తమిళంలో 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'రంగ రంగ వైభవంగా'. కేతికా శర్మ హీరోయిన్. ఈ సినిమాను సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ, 'మెగా హీరోలందరితోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు వైష్ణవ్ తేజ్తో ఈ సినిమా చేశాను. రీసెంట్గా విడుదలైన టీజర్కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సినిమాను సెప్టెంబర్ 2న గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.
'మా సినిమాలో వైష్ణవ్గారు కొత్తగా కనిపిస్తారు. అలాగే కేతికా శర్మ తనదైన నటనతో మెస్మరైజ్ చేసింది. దేవిశ్రీగారి మ్యూజిక్, శ్యామ్ దత్గారి విజువల్స్ సినిమాకు మేజర్ ఎసెట్స్ అవుతాయి. టీజర్ చూసినవారు ఎక్స్ట్రార్డినరీగా ఉందన్నారు. మూవీ ఎలా ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూసిన ప్రతి ఒక్కరూ రంగ రంగ.. వైభవంగా అనేలా ఉంటుంది' అని దర్శకుడు గిరీశాయ చెప్పారు.