Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా హీరో నితిన్ హైదరాబాద్లో నూతనంగా ప్రారంభమైన పప్పు స్టూడియోలో డబ్బింగ్ని ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ స్టూడియోను గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ స్టూడియోలో మొదట డబ్బింగ్ జరుపుకుంటున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' కావడం విశేషం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటివల విడుదలైన 'రారా రెడ్డి' చార్ట్ బస్టర్గా యూట్యూబ్ రికార్డ్ వ్యూస్, లైక్స్తో ట్రెండింగ్లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్లో నితిన్, అంజలి కెమిస్ట్రీ, మాస్ డ్యాన్సులు ఫ్యాన్స్ని అలరిస్తున్నాయి. తాజాగా రిలీజైన సముద్రఖని లుక్ కూడా ఆసక్తిని పెంచింది. ఎమ్మెల్యే రాజప్పగా కనిపించిన ఆయన ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో కతిశెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్ : మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, రవివర్మ, అనల్ అరసు.