Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చతురశ్రీ సమర్పణలో శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్, శ్రీ సంతోషి మా క్రియేషన్స్ బ్యానర్లపై రామ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ద్రౌపది'. 'నాకు కూడా ఐదుగురే' అనేది ట్యాగ్లైన్.
బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్లుక్, ట్రైలర్ని హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ట్రైలర్ను విడుదల చేయగా, చిత్రయూనిట్తోపాటు ఇతర అతిథులు సంయుక్తంగా ఫస్ట్లుక్ని రిలీజ్ చేేశారు. ఈ సందర్భంగా నిర్మాత బొడ్డుపల్లి బ్రహ్మచార్య మాట్లాడుతూ, 'వినూత్నమైన కథాంశంతో దర్శకుడు రామ్కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేదిగా ఈ చిత్రం ఉంటుంది. ఫస్ట్ లుక్, ట్రైలర్ అందరినీ అలరిస్తాయని భావిస్తున్నాను' అని తెలిపారు.
'ఇప్పుడు వస్తున్న సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది. ఈ సినిమాకి ద్రౌపది అని టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూనే ఆలోచించేలా చేసే సినిమా ఇది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి ఆర్టిస్ట్లు, టెక్నీషియన్లు కుదిరారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల ఉంటుంది' అని దర్శకుడు రామ్ కుమార్ చెప్పారు. సాక్షి, రాజేంద్ర, దేవిశ్రీ, శ్రావణ సంధ్య, కట్ట శివ, శ్రీనివాసాచారి, అజరు కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డి.యాదగిరి, ఎటిటర్: నాగిరెడ్డి.వి, మ్యూజిక్: జయసూర్య బొంపెం, రవి ములకలపల్లి, సహనిర్మాతలు: బొడ్డుపల్లి సంతోష్, సంపత్, సంకీర్త్.