Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిస్నీప్లస్ హాట్స్టార్లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర'. దీనికి సీక్వెల్గా 'పరంపర2' ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ వెబ్ సిరీస్లో జగపతి బాబు, శరత్కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.
ఎల్.కష్ణ విజరు, అరిగెల విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.
పొలిటికల్, రివేంజ్, యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని మేకర్స్ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అరిగెల విశ్వనాథ్ మాట్లాడుతూ, ''పరంపర 2'లో మరింత యాక్షన్, డ్రామా చూస్తారు. గోపీ పాత్రలో నవీన్ చంద్ర నటన ఆకట్టుకుంటుంది. అలాగే శరత్ కుమార్, జగపతిబాబు, రవివర్మ, ఆకాంక్ష సింగ్, దివి ..ఇలా వీరందరి క్యారెక్టర్స్ మీ అందర్నీ అలరిస్తాయి. ఆర్కా మీడియాకు 'బాహుబలి 2' ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో, ఈ సిరీస్ కూడా అంతే పెద్ద సక్సెస్ ఇస్తుందని ఆశిస్తున్నాను' అని తెలిపారు.
హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ, 'రచన అనే పాత్రలో నటించే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నా. చాలా ఎమోషన్స్, వేరియేషన్స్ ఉన్న పాత్ర నాది' అని చెప్పారు. 'పరంపర సీజన్ 1 వెజ్ థాలి అయితే, పరంపర 2 నాన్ వెజ్ మీల్స్. మరింత డ్రామా, యాక్షన్, రివేంజ్ చూస్తారు. సీజన్ 2 స్ట్రీమింగ్కు కొద్ది రోజులే ఉంది. కాబట్టి మొదటీ సీజన్ చూసేయండి, అప్పుడు మీకు సెకండ్ సీజన్ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ సీజన్లో మీరు ఏ అంశాలైతే మిస్ అయ్యాయనిపించాయో, వాటికి సీజన్ 2లో సమాధానం దొరుకుతుంది' అని హీరో నవీన్ చంద్ర అన్నారు. నటుడు రవి వర్మ మాట్లాడుతూ, 'ఈ వెబ్ సిరీస్లో మంచి క్యారెక్టర్ చేశాను. ఇది అందర్నీ అలరించే సిరీస్' అని తెలిపారు. 'నా క్యారెక్టర్ ఇందులో స్పెషల్గా ఉంటుంది. వెబ్ సిరీస్ చివరలో నా పాత్ర ఇంపార్టెంట్స్ ఏంటో తెలుస్తుంది. ఇది నాకు మంచి గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నాను' అని బిగ్ బాస్ దివి చెప్పారు.