Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో చిత్ర నాయికల్లో ఒకరైన దివ్యాంశ కౌశిక్ మీడియాతో మట్లాడుతూ, ''మజిలీ' తర్వాత నేను నటించిన చిత్రమిది. శరత్ గారు ఈ కథ చెప్పినపుడు నా పాత్ర చాలా నచ్చింది. ఇందులో నందిని అనే పాత్రలో కనిపిస్తా. ఒక భార్యగా, తల్లిగా కనిపిస్తా. భార్యగా రామారావుకి మోరల్ సపోర్ట్, గైడ్గా ఉంటా. నా పాత్రలో చాలా పరిణతి ఉంటుంది. ఈ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. 95లో జరిగే ఈ కథ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్తో ఈ సినిమా థ్రిల్ చేస్తుంది. 'మజిలీ'లో బబ్లీ గర్ల్గా నటించడం సువులుగానే అనిపించింది. కానీ నందిని లాంటి పాత్ర చేయడం నటిగా నాకు ఛాలెంజింగ్ పాత్ర. నందిని పాత్రని చాలా ఎంజారు చేశాను. పెర్ఫార్మ్ చేయడానికి ఎక్కువ స్కోప్ వున్న పాత్ర దొరికినందుకు చాలా సంతృప్తిగా ఉంది. నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్ని. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ఛాన్స్ వస్తే అందరి హీరోలతో పని చేయాలని ఉంది (నవ్వుతూ). అన్ని రకాల పాత్రలు చేయగలననే నమ్మకమూ ఉంది. ప్రస్తుతం సుధీర్ వర్మతో ఓ సినిమా పాటు 'మైఖేల్'లోనూ నటిస్తున్నా' అని తెలిపింది.