Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భీమదేవరపల్లి బ్రాంచి' ఇదొక ఆర్గానిక్ గ్రామీణ చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రం కూడా.
ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ సంఘటన ఆధారంగా ఈ సినిమాను నియోలిజైమ్ జోనర్లో తెరకెక్కిస్తున్నాం. ఈ జోనర్లో వస్తున్న మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం ' అని దర్శకుడు రమేశ్ చెప్పాల అన్నారు. ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమా కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్, సాంగ్స్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ని ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత బత్తిని కీర్తిలత గౌడ్ మాట్లాడుతూ, 'కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా థియేటర్, ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకున్నాం. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే సినిమా. రెండు గంటలు పల్లె వాతావరణం కళ్ళ ముందు కదలాడుతుంది. అంతేకాదు ప్రతి ఒక్కరినీ తమ గ్రామానికి తీసుకెళ్తుంది' అని తెలిపారు. సుధాకర్ రెడ్డి, కీర్తి లత, అభి, రూప, అంజి బాబు, రాజవ్వ, శుభోదయం సుబ్బారావు, సి.ఎస్.ఆర్.వివ రెడ్డి, పద్మ, ప్రసన్న, మానుకోట ప్రసాద్, గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వల్లి సత్య ప్రకాష్, మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి 'మీ శ్రేయోభిలాషి' చిత్రంతో రచయితగా ఎన్నో అవార్డులు అందుకున్న రచయిత రమేశ్ చెప్పాల కథ,మాటలు అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రానికి సహ నిర్మాత: రాజా నరేందర్ చెట్లపెల్లి, కెమెరా: చిట్టి బాబు, సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ, ఎడిటర్: బొంతుల నాగేశ్వర్ రెడ్డి, ఆర్ట్: మోహన్.