Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'సీతా రామం'. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మాణంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా తెరకెక్కింది.
హను రాఘవపూడి దర్శకుడు. మణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హను రాఘవపూడి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'మా 'సీతారామం'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఖచ్చితంగా అధిగమిస్తుంది. థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా అద్భుతం అని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు. ఆ కథకి ఓ ఉత్తరం ప్రేరణ కలిగించింది. నాకు కోఠికి వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు ఉంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఓపెన్ చేయని ఓ లెెటర్ కనిపించింది. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి, ఓపెన్ చేస్తే జర్నీ ఎలా ఉండేది?, మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ అలోచని కథగా రాశా. అయితే ఈ సినిమా పూర్తిగా ఫిక్షన్. అంతేకాదు లార్జన్ దేన్ లైఫ్ స్టొరీ కూడా. ఈ సినిమాలో రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఈ పాత్రే కాదు సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ కథని మలుపు తిప్పేవే. విశాల్ చంద్ర శేఖర్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభించింది. వైజయంతి మూవీస్లో చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రస్తుతం బాలీవుడ్లో సన్నీ డియోల్, నవాజ్తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమోజన్తో ఒక వెబ్ సిరిస్ ప్లాన్ ఉంది' అని హను రాఘవపూడి చెప్పారు.