Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్బికె 107 వర్కింగ్ టైటిల్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నేటి నుంచి (సోమవారం) కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హౌటల్ సెంటర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజరు ఈ సినిమాతో విలన్గా టాలీవుడ్కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
'బాలయ్య సినిమా నుంచి ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఏమైతే ఆశిస్తారో ఆ అంశాలన్ని పుష్కలంగా ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్, ఆయన బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా డైలాగ్స్ మెస్మరైజ్ చేసేలా ఉంటాయి. ఈ కథని, బాలయ్య క్యారెక్టర్ని దర్శకుడు గోపీచంద్ మలినేని అత్యద్భుతంగా డిజైన్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఫిదా చేసేలా ఇప్పటికే తమన్ పాటలకు స్వరాలను సమకూర్చారు. బాలయ్య సరసన శృతిహాసన్ నటించింది. వీరిద్దరి కెమెస్ట్రీ సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తుంది. బాలయ్య అలాగే గోపీచంద్ మలినేని, మైత్రి మూవీ మేకర్స్ కెరీర్లో ఈ సినిమా మరో బ్లాక్బస్టర్గా నిలువనుంది' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, సంగీతం:తమన్, డివోపీ: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సిఈవో: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి.