Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
బ్రిగేడియర్ విష్ణు శర్మ సుమంత్ మరో కీలక పాత్ర పోహిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా ఈ సినిమా రూపొందింది.
గ్రాండ్గా జరిగిన ఈవెంట్లో 'సీతారామం' థియేట్రికల్ ట్రైలర్ని చిత్ర బందం విడుదల చేసింది.
ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ,'అందరూ రొమాంటిక్ హీరో అని పిలవడంతో విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తిండి పోయే ఎపిక్ సినిమా. ఇలాంటి కథని ఎట్టిపరిస్థితిలో వదులకూడదనిపించింది. చివరి ప్రేమకథగా 'సీతారామం' లాంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని నిర్ణయించుకున్నా. అశ్వినీదత్ గారి లాంటి సినిమా పై ప్యాషన్ వున్న నిర్మాతతో ఇప్పటివరకూ పని చేయలేదు. హను గారు సినిమా పై గ్రేట్ ప్యాసన్ వున్న రచయిత, దర్శకుడు. సీతగా మణాల్ అద్భుతంగా చేసింది. రష్మిక పాత్ర కూడా అద్భుతంగా వుంటుంది. సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ వుంది. సీతారామం లార్జర్ దెన్ లైఫ్ సినిమా. ఆగస్ట్ 5న అందరూ థియేటర్లో చూసి ఎంజారు చేయండి' అని అన్నారు. 'ఈ సినిమా బాగా వర్షం వచ్చినపుడు వేడి కాఫీ తాగినట్లు వుంటుంది. ఎండాకాలంలో చల్లటి నీరు తాగినట్లు వుంటుంది. ఈ సినిమా చూస్తున్నపుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఇది రాసివ్వగలను. ఈ సినిమా మీతో పాటు వచ్చేస్తుంది. చిరకాలం గుర్తిండిపోతుంది. కథ, పాత్రలు మాత్రమే వుంటాయి' అని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు.
నాయిక మణాల్ ఠాకూర్ మాట్లాడుతూ,' హనుగారు ఈ కథ చెప్పినపుడు సీత, రామ్ల ప్రేమలో పడిపోయా. నేను చేసిన సీత పాత్ర అద్భుతంగా వుంటుంది' అని తెలిపారు.
'అఫ్రిన్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ పాత్రకు ఎలా న్యాయం చేయాలని దర్శకుడు హను గారిని అడిగాను. ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ నా పాత్రకు న్యాయం చేశానని పిస్తుంది. సీత రామ్లా అందమైన ప్రేమ కథని అఫ్రిన్ చెప్పే విధానం మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను' అని మరో నాయిక రష్మిక మందన్నా అన్నారు. సుమంత్ మాట్లాడుతూ,'ఈ సినిమా 150 పేజీల కథ మొత్తం చదివిన తర్వాత సీతారామం దశ్యకావ్యం అవుతుందనిపించింది. 'గోదావరి' చేశాను. అది అప్పుడు క్లాసిక్ అయ్యింది. ఇప్పుడు సీతారామం కూడా క్లాసిక్ అవుతుంది' అని చెప్పారు. 'కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కాశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రష్యా లాంటి ప్రదేశాల్లో సాహసించి చిత్రీకరణ చేశార. ఈ సినిమా చూసి మాకు సూపర్ సక్సెస్ ఇస్తారనే నమ్మకం ఉంది' అని నిర్మాత అశ్వినీదత్ అన్నారు.