Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ తాజాగా నటించిన చిత్రం 'తీస్ మార్ ఖాన్'. ప్రొడక్షన్ నెం 3గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటిస్తుండగా, సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. 'చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్లు, ఫస్ట్ సింగిల్తో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా 'సమయానికే' అంటూ సాగే సెకండ్ సింగిల్ను రిలీజ్ చేశారు. ఈ మెలోడీ సాంగ్లో ఆది, పాయల్ రాజ్పుత్ జోడి ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సాయి కార్తీక్ అద్భుతమైన మెలోడీ ట్యూన్ను అందించగా, రాకేందు మౌళి సాహిత్యాన్ని సమకూర్చారు. శతి ఈ పాటను అద్భుతంగా అలపించారు. స్టూడెంట్, రౌడీ, పోలీస్గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈచిత్రానికి ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్తో నిర్మాతలు నిర్మించారు' అని చిత్ర బృందం తెలిపింది.