Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో 'శుక్ర' దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా 'మాటరాని మౌనమిది'.
మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో మల్టీ జోనర్గా రూపొందుతున్నదీ సినిమా.
తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ను మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఆగస్టు 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
'ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఫస్ట్ ఫిల్మ్ 'శుక్ర' అటు అప్రిసియేషన్స్తో పాటు ఇటు కమర్షియల్గా వర్కవుట్ కావడంతో తన రెండో చిత్రానికీ అంతకంటే మంచి రిజల్ట్ వస్తుందని దర్శకుడు సుకు పూర్వాజ్ ఆశిస్తున్నారు. ఈ సీజన్లో పెద్ద చిత్రాలు రిలీజైన తర్వాత కంఫర్ట్ టైమ్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది' అని చిత్ర బృందం తెలిపింది.
అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్, శ్రీహరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, నిర్మాత : రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్, దర్శకుడు :సుకు పూర్వాజ్.