Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'. నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అవుతోంది. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి సిఐ మురళి పాత్రలో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత వేణు ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో వేణు మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'దమ్ము' తర్వాత సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. మాకు ఫ్యామిలీ బిజినెస్స్ చాలా ఉన్నాయి. వాటితో బిజీ అయిపోయా. సినిమాల గురించి అలోచించే తీరికే లేకుండాపోయింది. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా వద్దనే వాడిని. అయితే కరోనాకి థాంక్స్ చెప్పుకోవాలి. ఆ సమయంలో ఇంట్లో కూర్చుని రకరకాల సినిమాలను, వెబ్ సిరీస్లను చూడ్డం మొదలుపెట్టాను. అప్పుడు మళ్ళీ సినిమాపై ఆసక్తి కలిగింది. మంచి పాత్రలు చేయాలనిపించింది. సరిగ్గా ఈ సమయంలో దర్శకుడు శరత్ మండవ ఈ కథ చెప్పారు. కథ అద్భుతంగా ఉంది. సిఐ మురళిగా నా పాత్ర గురించి చెప్పారు. చాలా బావుంది. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జోనర్ కూడా ఫస్ట్ టైమ్. రవితేజ గారి లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. వైడ్ రీచ్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమా చేస్తే నేను మళ్ళీ యాక్ట్ చేస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే ఆసక్తితో ఈ సినిమా చేశా. అలాగే చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ నాకు నేనుడబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతప్తి వుండేది. కానీ ఈ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పడం ఒక తప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్తా. ఈ సినిమాతో నాకు మళ్ళీ ఒక ఫ్లాట్ ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్ చెరుకూరి, శరత్ మాండవకి మనస్పూర్తిగా కతజ్ఞతలు. ఇకపై ఖచ్చితంగా సినిమాలు చేస్తా. అలాగే వెబ్ కంటెంట్ పై కూడా ప్రత్యేకంగా దృష్టి ఉంది. ఛారు బిస్కెట్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. అలాగే ఒక వెబ్ సిరిస్ కూడా చర్చల్లో ఉంది' అని అన్నారు.