Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ''లైగర్' (సాలా క్రాస్బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదల కానుంది. మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ చిత్రంపై భారీ హైప్, అంచనాలను పెంచింది. దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రంగా నిలిచింది. ఫస్ట్ సింగిల్ 'అక్డీ పక్డీ' వైరల్గా మారి మ్యూజిక్ చార్ట్లలో టాప్ ట్రెండింగ్లో ఉంది. ప్రస్తుతం ఫస్ట్ సింగిల్, ట్రైలర్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నాయి.
ట్రైలర్ సూపర్ సక్సెస్ తర్వాత 'వాట్ లాగా దేంగే' అనే థీమ్ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ థీమ్ సాంగ్ లైగర్ స్వాగ్, యాటిట్యుడ్ని ఆవిష్కరించింది. స్లమ్డాగ్ నుండి ఎంఎంఏ ఫైటర్గా దేశానికి ప్రాతినిధ్యం వహించే జర్నీ గ్లింప్స్ విజువల్స్ బ్రిలియంట్గా ఉన్నాయి. 'వీ ఆర్ ఇండియన్స్.. హమ్ కిసీసే కమ్ నహీ'' .. ''వాట్ లగా దేంగే... ఆగ్ హే అందర్'' అని ఈ థీమ్ సాంగ్లో లైగర్ చెప్పిన మాటలు పవర్ ఫుల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. మ్యూజికల్గా, విజువల్గా 'వాట్ లాగా దేంగే' షేక్ చేస్తోంది. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్గా, థాయ్లాండ్కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రారు, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: పూరీ జగన్నాథ్, నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, డీవోపీ: విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, స్టంట్ డైరెక్టర్: కేచ.